సుల్తాన్బజార్, అక్టోబర్ 11: మహాత్మాగాంధీ బస్స్టేషన్ నుంచి మహారాష్ట్రలోని షిర్డీ దేవాలయానికి మంగళవారం నుంచి రాజధాని, గరుడ ప్లస్ బస్సులను ప్రారంభిస్తున్నట్టు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బీ వరప్రసాద్ సోమవారం తెలిపారు. రాజధాని ఏసీ బస్సు ఉదయం 5.30 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు షిర్డీకి చేరుతుందని తెలిపారు. ఈ బస్సులో పెద్దలకు టికెట్ ధర రూ.1,270, పిల్లలకు రూ.968 ధర ఉంటుందన్నారు. గరుడ ప్లస్ ఏసీ బస్సు సాయంత్రం 7.30 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు షిర్డీకి చేరుతుందని పేర్కొన్నారు. పెద్దలకు టికెట్ ధర రూ.1,422, పిల్లలకు రూ.1,060గా నిర్ణయించినట్టు వివరించారు.