హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఇవాళ ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చిన విషయం విదితమే. లాక్డౌన్ అమల్లోకి రావడంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లతో పాటు అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్, కోఠి, అమీర్పేట, దిల్సుఖ్నగర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్ ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్లపైకి వస్తున్న వాహనదారులను పోలీసులు ఆపి కౌన్సెలింగ్ చేస్తున్నారు. అత్యవసర సర్వీసులు, టీకాల కోసం వెళ్లే వారికి మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు.