హైదరాబాద్ : ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్ తండ్రి సోమయ్య (92) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. సోమయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావుతో పాటు వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సోమయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లిలో బుధవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.