హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభలో ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన తర్వాత బడ్జెట్ పద్దులపై చర్చ చేపట్టనున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా మన ఊరు – మన బడి, కేసీఆర్ కిట్, సింగరేణి కాలరీస్ సంస్థ ప్రయివేటీకరణ, పోడు భూముల పంపిణీ, పల్లెప్రగతి, నూతన ఆస్పత్రుల ఏర్పాటుపై చర్చించనున్నారు.