హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ విగ్రహాష్కరణ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు తరలివచ్చారు. కాంబోడియాకు చెందిన బివి హర్ష, బుద్ధగయ నుంచి కష్యప్ బలే, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సుమారు 30 మంది బౌద్ధ భిక్షువులు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. వారంతా విగ్రహం వద్ద రావి ఆకులతో నీళ్లను చల్లి సంప్రోక్షణ చేశారు.
సంప్రదాయబద్ధంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బౌద్ధ భిక్షువులను సీఎం కేసీఆర్ సత్కరించారు. వారు సీఎం కేసీఆర్కు కండువా ఇచ్చారు. కార్యక్రమంలో వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. బౌద్ధ సంప్రదాయంలో కార్యక్రమాన్ని జరిపించినందుకు ృతజ్ఙతలు తెలిపారు.