ప్రతి రంగంలోనూ విప్లవాత్మక సంస్కరణలు
అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా పథకాలు
ఓవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ వాటి ఫలితాలను ప్రజలకు చేర్చడం… మరోవైపు సంక్షేమ పథకాలతో బడుగు వర్గాలకు అండగా నిలిచి వారిని ఉద్ధరించడం.. ఇంకోవైపు భవిష్యత్తు తరాలకు సైతం లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకొని, కార్యక్రమాలు అమలు చేయడం ప్రభుత్వాల బాధ్యత. ప్రతి వ్యక్తికి.. ప్రతి కుటుంబానికి.. అండగా నిలిచినప్పుడే ఆ ప్రభుత్వాలు సఫలమైనట్టు లెక్క. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వీటన్నింటినీ అమలు చేసి చూపిస్తున్నది. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా ఆదర్శనీయ పథకాలు, అద్భుత సంస్కరణలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎనిమిదేండ్లలోనే దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, సంస్కరణలను పరిశీలిస్తే.. అభివృద్ధి, మానవీయ కోణం, ప్రజా సంక్షేమం, భవిష్యత్తు పట్ల చిత్తశుద్ధి కనిపిస్తాయి. అందుకే.. రైతులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. ఫలితంగా ‘ఇదీ తెలంగాణ మాడల్’ అనిపిస్తున్నాయి.
రైతుబంధు
ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడికి పైసల్లేక రైతులు పడ్డ గోస అంతా ఇంతా కాదు. పెట్టుబడికి ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకునేవారు. ప్రభుత్వం నుంచి నయా పైసా సాయం అందేది కాదు.
రైతుబీమా
ఉమ్మడి ఏపీలో రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడాల్సిందే. ప్రభుత్వం నుంచి నయా పైసా సాయం అందేది కాదు. పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం చిన్నాభిన్నం అయ్యేది.
సాగు విస్తీర్ణం
2014లో తెలంగాణలో వానకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు మాత్రమే.
ఆదర్శంగా జోనల్ వ్యవస్థ
ఉద్యోగాల భర్తీలో అసమానతలు. రాష్ట్రమంతా రెండే జోన్లు. లోకల్, నాన్ లోకల్ పోస్టుల కోటాలో గందరగోళం. కొన్నింటిలో 70 : 30.. మరికొన్నింటిలో 85 : 15 శాతం.. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో అనేక అసమానతలుండేవి.
గొర్రెలు, చేపల పంపిణీ
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు కుల వృత్తులను పట్టించుకోకుండా వాటిపై ఆధారపడిన వారి జీవితాలను ఆగం చేశాయి.
హరితహారం
గతంలో తెలంగాణలో 24 శాతం మాత్రమే పచ్చదనం ఉండేది. అడవుల పునరుద్ధరణ లేదు. పట్టణ పార్కులు లేవు. 5 ఫారెస్టు సర్కిళ్లు, 28 ఫారెస్టు డివిజన్లు, 106 ఫారెస్ట్ రేంజ్లు మాత్రమే ఉండేవి.
బస్తీ దవాఖానలు
పట్టణ పేదలు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ప్రైవేట్కు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసుకునేవారు.
కేసీఆర్ కిట్లు
గతంలో పేద మహిళలు గర్భంతో ఉన్నా కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి. ఆర్థిక స్థోమత లేక పోషకాహారం తినలేక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు.
టీ డయాగ్నోస్టిక్స్
గతంలో వ్యాధినిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబులే దిక్కు. వేలకువేలు ఖర్చు చేయాల్సి వచ్చేది. డబ్బు లేక వ్యాధి ముదిరేవరకు పరీక్షలు చేయించుకోక అవస్థలు పడేవారు.
24 గంటల విద్యుత్తు
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లోనూ కనీసం 4 నుంచి 6 గంటల పాటు విద్యుత్తు కోతలుండేవి. జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో 6 నుంచి 10 గంటలు.. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 12 గంటల పాటు విద్యుత్తు ఉండేది కాదు.. పరిశ్రమలకు వారంలో 2 రోజులపాటు పవర్ హాలిడేలు ఇచ్చేవారు. వ్యవసాయానికి 4-6 గంటల విద్యుత్తు అర్ధరాత్రి, అపరాత్రి అనే భేదం లేకుండా ఇచ్చేవారు.
మిషన్ భగీరథ
ఒకప్పుడు తాగునీటికి ప్రజలు అష్టకష్టాలు పడేవారు. నీళ్ల కోసం కొట్లాటలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగేవి. ప్రజలు కిలోమీటర్ల కొద్ది దూరంలోకి వెళ్లి తీసుకరావాల్సి వచ్చేది.
గిరిజనులకు 10 శాతం రిజ్వేషన్లు
రాష్ట్రంలో గిరిజన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచాలని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.
పాలనా సంస్కరణలు
ఉమ్మడి రాష్ట్రంలో 10 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ప్రజలు కలెక్టర్ను కలువాలన్నా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ఒక దగ్గర, వ్యవసాయ కార్యాలయం మరో దగ్గర విసిరేసినట్టుగా ఉండేవి. ఎమ్మెల్యేలకు అధికారిక నివాసాలే లేవు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలపాలంటే నేరుగా ఎమ్మెల్యేల ఇంటికే వెళ్లాల్సి వచ్చేది.
టీఎస్ ఐపాస్
తెలంగాణ ఏర్పాటుకు ముందు పరిశ్రమలకు అనుమతి పొందేందుకు అనేకరకాల కార్యాలయాల చుట్టూ తిరగాల్సివచ్చేది. ఒక పరిశ్రమ గ్రౌండ్ కావాలంటే తక్కువలో తక్కువ ఒక సంవత్సరంపైన సమయం పట్టేది.
పల్లె ప్రగతి
ఉమ్మడి రాష్ట్రంలో గ్రామం అంటే.. గుంతలు పడ్డ రోడ్లు, ఎక్కడో ఒకటి కనిపించే వీధి దీపాలు, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం.. ఇలాంటి దీనస్థితి ఉండేది. ఇక వర్షాకాలం వస్తే గ్రామాలు జ్వరాలతో వణికిపోయేవి.
ఆసరా పెన్షన్లు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పింఛన్లు ఒక్కొక్కరికి రూ.200, వికలాంగులకు రూ.500 ఇచ్చేవారు. ఇవి వారికి ఏమాత్రం అండగా ఉండకపోయేవి.
ఆర్ అండ్ బీ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. 67,714 కిలోమీటర్లు ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు అధ్వాన్న స్ధితిలో ఉండేవి. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు.
నేతన్నలను ఆదుకునేలా..
తెలంగాణ రాక పూర్వం నేత కార్మికులు పనులు దొరక్క ఇతర ప్రాంతాలకు వలస పోయేవారు. పూట గడవక పెద్ద సంఖ్యలో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడేవారు.
గీత కార్మికుల్లో పెరిగిన భరోసా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రమాదవశాత్తు మరణించిన గీతకార్మికుల కుటుంబాలకు రూ.2 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.50వేలు ఎక్స్గ్రేషియా ఇచ్చేవారు.
దళితబంధు పథకం
దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి గత ప్రభుత్వాలు. ఆర్థిక సాయం చేసినా అంతంతమాత్రమే. అదీ కూడా సవాలక్ష షరతులు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వారి పరిస్థితి మిగిలిపోయేది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు
ఒకప్పుడు గురుకులాలు అంటే ఉడికీ ఉడకనీ బువ్వ. అదీగాక జిల్లాకు ఒకటీ అరా మాత్రమే. ఫలితంగా అనేక మంది నిరుపేదలు ఆర్థిక స్థోమతలేక విద్యకు దూరం కావాల్సిన దుస్థితి.
కల్యాణలక్ష్మీ/షాదీ ముబారక్
ఒకప్పుడు పేదింట ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే అప్పు చేయాల్సిందే. అలా చేసి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఎన్నో.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు
తెలంగాణకు గోదావరి జలాల్లో 954 టీఎంసీలు కేటాయించగా, అందులో కనీసం 150 టీఎంసీలను కూడా వినియోగించుకోలేని దుస్థితి.
మన ఊరు -మనబడి
గతంలో ప్రభుత్వ బడులను రేషనలైజేషన్ పేరుతోమూసేసేవి. టీచర్ల సంఖ్యను కుదించేవి.