హైదరాబాద్, మార్చి 21, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన విజయుడు ఎన్నికను సవాల్ చేస్తూ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకుమార్ ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఉండవల్లి మండలం పుల్లూరు పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న విజయుడు తన ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే అలంపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు విజయుడి ఎన్నిక చెల్లదని ప్రకటించాలని పిటిషన్ర్ పేరొన్నారు. ఈ పిటిషన్ను గురువారం జస్టిస్ బీ విజయసేన్ రెడ్డి విచారణ జరిపారు. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేశారు.