హైదరాబాద్ సిటీబ్యూరో/అబ్దుల్లాపూర్మెట్, జూన్ 18(నమస్తే తెలంగాణ): పైండ్లెన 12 ఏండ్లకు సంతానం కలిగిందని ఆ దంపతులు ఎంతో మురిసిపోయారు. కానీ వారి ఆనందం రెండు నెలలకే ఆ విరైంది. రాత్రి తల్లి పక్కన పడుకున్న ఆ బాబు తెల్లారేసరికి శవమయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాజ్పూర్లో చోటుచేసుకున్నది. పోలీసు ల కథనం ప్రకారం.. అనాజ్పూర్కు చెందిన లత, ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లికి చెందిన తిరుమలేశ్ దంపతులు. వీరు ఎల్బీనగర్లో ఉంటున్నా రు. వీరికి 12 ఏండ్ల తర్వాత సంతానం కలిగింది. బిడ్డ పుట్టగానే ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. 15 రోజుల క్రితం లత, బాబు ఉమామహేశ్వర్(2 నెలలు)తో కలిసి అనాజ్పూర్కు వెళ్లింది. గు రువారం అర్ధరాత్రి బాబుకు పాలు ఇచ్చి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజాము న 4గంటల ప్రాంతంలో లత నిద్రలేచి చూసే సరికి కొడుకు కనిపించలేదు. చివరకు ఇంటిపైన వాటర్ ట్యాంకులో శవమై కనిపించాడు. చనిపోయిన బిడ్డను చూసిన లత కన్నీరుమున్నీరైంది. అయితే ఇది పుట్టింటి వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.