హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ కొనియాడారు. తెలంగాణ భవన్లో గురువారం జరిగిన కార్మిక విభాగం అనుబంధ హోటల్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని కార్మికవర్గాల సంక్షే మం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కార్మిక విభాగం కమిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎం అనిల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ రూప్సింగ్, హోటల్స్ యూనియన్ నాయకులు సాయిప్రతాప్రెడ్డి, మల్లేశ్యాదవ్, చంద్ర య్య, రవి, మహేంద్రయాదవ్ తదితరులు పాల్గొన్నారు.