ఆర్మూర్ : ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని పోరాడుతున్నందునే తమను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్వీ నాయకులు అగ్గు క్రాంతి, మీరా, శ్రవణ్, షాహిద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బుధవారం బీఆర్ఎస్వీ నేతలను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం బీఆర్ఎస్వీ చేస్తున్న పోరాటాన్ని అణిచివేసేందుకు అక్రమంగా అరెస్ట్లు చేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నామని తెలిపారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఫీజురీయింబర్స్మెంట్ విడుదల చేసే వరకు ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేసే వరకు నిరంతరం పోరాడుతామన్నారు.