KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తాజాగా స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రెండు సార్లు అధికారాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా కేటీఆర్ ధన్యవాదలు తెలిపారు. అయితే, ఇవాళ వెలువడిన ఫలితాలు తమను ఏమీ బాధించలేదన్నారు. కానీ అనుకున్న రీతిలో ఫలితం రాకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు. తాజా ఫలితాలను ఓ పాఠంగా తీసుకొని మళ్లీ అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు.
Grateful to the people of Telangana for giving @BRSparty two consecutive terms of Government 🙏
Not saddened over the result today, but surely disappointed as it was not in expected lines for us. But we will take this in our stride as a learning and will bounce back…
— KTR (@KTRBRS) December 3, 2023
అదేవిధంగా నిన్న ‘హ్యాట్రిక్ లోడెడ్’ అంటూ పోస్టు చేసిన ఓ ఫొటోను కేటీఆర్ రీట్వీట్ చేస్తూ.. ‘గురి తప్పింది’ అంటూ రాసుకొచ్చారు.
This one ain’t gonna age well 😁
Missed the mark https://t.co/IUN1vKdTsc
— KTR (@KTRBRS) December 3, 2023