KTR | రాజన్న సిరిసిల్ల : ఉపాధి కరువై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు సిరిపురం లక్ష్మినారాయణ మృతదేహానికి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సాయం కింద పార్టీ తరపున రూ. 50 వేలను కుటుంబానికి అందించారు కేటీఆర్.
నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థిక సాయానికి సంబంధించి కలెక్టర్ అనురాగ్ జయంతితో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం తరఫున రావాల్సిన సహాయాన్ని వెంటనే అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నేతన్న లక్ష్మీనారాయణ కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.