KTR | రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 16వ తేదీన మోదీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సందర్భంగా మూడం సాయికుమార్ అనే కార్యకర్తకు మంటలు అంటుకున్నాయి. దీంతో సాయి కుమార్కు కాలికి, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో కేటీఆర్ సాయికుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. సాయి కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, అవసరమైతే మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్కు పంపిస్తానని సాయి కుటుంబానికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. సాయి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు కేటీఆర్. కేటీఆర్ వెంట జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సీనియర్ నాయకురాలు తుల ఉమతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ముడం సాయి కుమార్ ని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, అవసరమైతే మరింత మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ కి పంపిస్తామని మూడం సాయికుమార్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం… pic.twitter.com/g6bdHbik3F
— BRS Party Sircilla (@BrsSircilla) March 28, 2024