KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తన అమ్మమ్మ, తాత జ్ఞాపకార్థంగా.. సకల సదుపాయాలతో రెండు అంతస్తుల స్కూల్ బిల్డింగ్ను కట్టించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. అమ్మమ్మ లక్ష్మీ, తాత జే కేశవరావు జ్ఞాపకార్థం.. తన వ్యక్తిగతంగా కొత్త పాఠశాల భవనాన్ని నిర్మించాను. కొన్ని తుది మెరుగులు మినహా ఈ భవనం దాదాపు పూర్తయింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొదురుపాకలో ఈ స్కూల్ భవనాన్ని నిర్మించినట్లు కేటీఆర్ తెలిపారు.
కొదురుపాక ఆర్అండ్ఆర్ కాలనీలో జడ్పీ పాఠశాల మాత్రమే నిర్మాణం జరిగింది. దీంతో ప్రాథమిక పాఠశాలను జడ్పీ స్కూల్ ఆవరణలో కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నకేటీఆర్ తన అమ్మమ్మ, తాతయ్య జోగినపల్లి లక్ష్మీ కేశవరావు జ్ఞాపకార్థం తన సొంత నిధులతో జడ్పీ స్కూల్ ఎదుట ఉన్న 20 గుంటల స్థలంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మిస్తానని గతంలో ప్రజలకు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జనవరి 9వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు, సంతోష్కుమార్ తండ్రి రవీందర్రావుతో కలిసి భూమి పూజ చేశారు.
A promise made must be a promise kept😊
Had committed to building a new School building in my personal capacity in memory of my maternal grandparents Sri J. Keshava Rao Garu and Smt. Lakshmi Garu
It’s almost done barring a few final touches. Will be ready for students starting… pic.twitter.com/RwxD10YaT7
— KTR (@KTRBRS) April 8, 2024