KTR | మోసం కాంగ్రెస్ నైజం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నయవంచనకు నిలువెత్తు రూపం.. కాంగ్రెస్ అని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విమర్శించారు. అందుకే ఆదిలోనే ఇండియా కూటమికి బీటలు వచ్చాయని అన్నారు. అందుకే కాంగ్రెస్ను వీడి టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరిపోరుకు సిద్ధమయ్యాయని తెలిపారు.
మిత్రపక్షాలను ఒప్పించలేని కాంగ్రెస్.. దేశ ప్రజలను ఏం మెప్పిస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. మోదీని, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదని.. ఇండియా కూటమికి అంతకన్నా లేదని విమర్శించారు. మిత్రపక్షాలు దూరం కావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇక దేశప్రజల చూపు ప్రాంతీయ శక్తులవైపే ఉందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కేసీఆర్ అయినా.. బెంగాల్లో మమతా దీదీ అయినా.. పంజాబ్, ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేది.. రాష్ట్రాల్లో బలమైన పార్టీలే అని కేటీఆర్ స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ ఖతం అని అన్నారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో.. ప్రాంతీయ శక్తుల పాత్రే కీలకమని పేర్కొన్నారు.