KTR | హైదరాబాద్ : ఓ గిరిజన వృద్ధురాలు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తనకు వచ్చిన రూ. 2 వేల పెన్షన్లో నుంచి రూ. వెయ్యి నా పెద్ద కొడుకు కేసీఆర్కు ఇవ్వాలని మాజీ ఎంపీ మాలోత్ కవితకు అందజేశారు.
బిడ్డా.. నాకు రెండువేల రూపాయిల పెన్షన్ వచ్చినాది!…నా పెద్ద కొడుకు కేసీఆర్ కి వెయ్యి రూపాయలు ఇవ్వు”.. ఇంత ఆప్యాయత, ప్రేమ.. తెలంగాణల కేవలం కేసీఆర్కే సొంతమని కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడు కాదు.. ఎంతో మందికి పెద్ద కొడుకు! మా పార్టీని నడిపించే నాయకుడు అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని ధారపోసిన దార్శనీకుడు.. ఎన్ని ఢిల్లీ పార్టీలు ఉన్నా.. తెలంగాణ ఇంటి పార్టీ బిఆర్ఎస్! మాది పేగు బంధం! బోడ బాజీ అమ్మకి నా వందనం అని కేటీఆర్ అన్నారు. జై కేసీఆర్.. జై బిఆర్ఎస్.. జై తెలంగాణ అని కేటీఆర్ నినదించారు.
“బిడ్డా…నాకు రెండువేల రూపాయిల పెన్షన్ వచ్చినాది!…నా పెద్ద కొడుకు కేసీఆర్ కి వెయ్యి రూపాయలు ఇవ్వు”….ఇంత ఆప్యాయత, ప్రేమ….తెలంగాణల కేవలం కేసీఆర్ కే సొంతం
కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడు కాదు….ఎంతో మందికి పెద్ద కొడుకు!
మా పార్టీని నడిపించే నాయకుడు 🙏🏽తెలంగాణ కోసం తన జీవితాన్ని… pic.twitter.com/YyWygWDfPg
— KTR (@KTRBRS) April 10, 2025