KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచల్గూడ జైల్లో ములాఖత్ అయ్యారు. మన్నె క్రిశాంక్ను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. క్రిశాంక్ పోస్టు చేసిన సర్క్యులర్ తప్పా..? అని ప్రశ్నించారు. చేయని తప్పుకు క్రిశాంక్ను జైల్లో వేశారు. రేవంత్ సర్కార్ చేసిన వెధవ పనికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్రిశాంక్పై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి.. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ బుద్ధి తెచ్చుకోవాలి.. క్రిశాంక్ను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మన్నె క్రిశాంక్తో ములాఖత్ అవ్వడానికి చంచల్ గూడ జైలుకు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ https://t.co/9CfUb2aHut pic.twitter.com/uPjO7xf0GL
— Telugu Scribe (@TeluguScribe) May 8, 2024