KTR | తనపై పరువు నష్టం దావా వేస్తానని కాంగ్రెస్ తెలంగాణ మాజీ ఇన్ఛార్జి మాణిక్యం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ వేశారు. నోటీసులు ఎవరికి పంపాలో తెలియక మాణిక్కం ఠాకూర్ అయోమయంలో ఉన్నారని.. ఈ గందరగోళంతోనే నోటీసులను తప్పుడు అడ్రస్కు పంపించినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.
టీపీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నారని చేసిన ఆరోపణలపై పరువు నష్టం దావా వేశానని.. దీనిపై వారం రోజుల్లోనే సమాధానం ఇవ్వాలని మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు కేటీఆర్కు పంపిన పరువు నష్టం దావా డాక్యుమెంట్ను షేర్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. పీసీసీ ప్రెసిడెంట్ పదవి కోసం రేవంత్ రెడ్డి 50 కోట్లు లంచం ఇచ్చారని మీ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డినే ఆరోపించారని మాణిక్కం ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. తాను కేవలం కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలనే ప్రస్తావించానని తెలిపారు. ఈ ఆరోపణలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికీ వెనక్కి తీసుకోలేదని.. అలాగని వివరణ కూడా ఇవ్వలేదని అన్నారు. అందుకే పరువు నష్టం దావా నోటీసులను సరైన అడ్రస్కు పంపించాలని సూచించారు. తన అడ్రస్కు కాకుండా తెలంగాణ సెక్రటేరియట్లో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపించాలని అన్నారు.
Manickam Garu,
Why are you in a confused mode and misdirecting these notices?
It was your colleague congressman & MP Venkat Reddy who had alleged on record that Revanth Reddy bribed you and bought the PCC president post for ₹50 Crore
I had merely quoted the same since it was… https://t.co/YtK6EY9EIj pic.twitter.com/gickKF8Euy
— KTR (@KTRBRS) January 31, 2024