బీఆర్ఎస్ హయాంలో ఒక్క హైదరాబాద్లోనే 42 ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించాం. మా హయాంలో మొదలు పెట్టిన వాటికే కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేస్తున్నది. ఈ రెండేండ్లలో కనీసం ఒక రోడ్డు అయినా నిర్మించావా? కొత్త రోడ్ల సంగతి తర్వాత కనీసం రోడ్లపై పడిన గుంతలైనా పూడ్చారా?
-కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో, రెండేండ్లలో కాంగ్రెస్ (Congress) సర్కారు ఏం చేసిందో చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (KTR) సవాల్ విసిరారు. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో దమ్ముంటే చర్చకు రావాలని సీఎం రేవంత్రెడ్డికి (Revanth Reddy) సవాల్ విసిరారు. చెత్త ఎవరిది.. సత్తా ఎవరిదో తేల్చుకుందామని అన్నారు. డేట్, టైమ్, ప్లేస్ రేవంత్రెడ్డే ఫిక్స్ చేయాలని కోరారు. కమాండ్ కంట్రోల్ సెంటరా? గాంధీభవనా? అసెంబ్లీనా? ఎకడైనా చర్చకు తాము రెడీ అని సవాల్ చేశారు. జూబ్లీహిల్స్లో ఓడిపోతామనే రేవంత్రెడ్డి ఫ్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డికి ఆయన భాషలో ఆయనకు అర్థమైయేటట్టు చెప్పే సత్తా తమకు ఉన్నదని, కానీ, ఆయన తిట్టినా తాము మాత్రం గౌరవంగానే మాట్లాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణభవన్లో బుధవారం జూబ్లీహిల్స్ ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం బీఆర్ఎస్ హయాంలో చేసిన అంశాలను కేటీఆర్ వివరించారు.
హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు నిర్మించాం
బీఆర్ఎస్ హయాంలో ఒక్క హైదరాబాద్లోనే 42 ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించామని కేటీఆర్ చెప్పారు. తమ హయాంలో మొదలు పెట్టిన వాటికే కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేసిందని అన్నారు. అవి కాకుండా కొత్తగా ఈ రెండేండ్లలో ఒక రోడ్డు అయినా నిర్మించావా? అని రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. కొత్త రోడ్ల సంగతి తర్వాత కనీసం రోడ్లపై పడిన గుంతలైనా పూడ్చారా? అని నిలదీశారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని, కటింగ్ మినిస్టర్ కాదని, అందుకే రేవంత్రెడ్డి కొంత హుందాగా ఉండాలని హితవుపలికారు. నగర ప్రజలు మళ్లీ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి వచ్చిందని ఫైరయ్యారు. దీనిపై కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
లక్ష ఇండ్లు నిర్మించాం.. మరి మీరు?
పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిదని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో ఒక ఇల్లు అయినా కట్టారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని రేవంత్రెడ్డికి చాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ సరార్ ఒక ఇల్లు కట్టకపోగా, వేలాదిమంది పేదల ఇండ్లను హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టిందని ఫైరయ్యారు. మరోవైపు హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది కూడా తమ ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మెట్రో సీఎఫ్వో, ఎల్అండ్టీ సీఎఫ్వోలను బెదిరిస్తున్నదని ఫైరయ్యారు. కాంగ్రెస్ బాధ తట్టుకోలేక, వాళ్ల బెదిరింపులకు తాళలేక ఎంత మంది పారిశ్రామికవేత్తలు పారిపోయారో చర్చకు సిద్ధమా? అని నిలదీశారు.
ఒక ఎల్ఈడీ బల్బ్ బిగించారా?
కరెంటు విషయంలోనూ కాంగ్రెస్ సర్కారు తీరును కేటీఆర్ తూర్పారబట్టారు. కాంగ్రెస్ హయాంలో వారానికి రెండు, మూడు రోజులు పవర్ హాలిడేస్ ఉంటే.. తాము అధికారం చేపట్టిన తర్వాత 24 గంటలు కరెంటు ఇచ్చామని గుర్తు చేశారు. ఎల్ఈడీ బల్బులతో తెలంగాణను దేదీప్యమానంగా చేశామని చెప్పారు. కానీ, ఈ రెండేండ్లలో రేవంత్ సరార్ ఒక ఎల్ఈడీ అయినా బిగించిందా? అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో విద్యుత్తు వెలుగులు కొనసాగాయో, ఎవరి హయాంలో విద్యుత్తు కోతలతో ప్రజలు ఇబ్బంది పడ్డారో చర్చిద్దామా? అని సవాల్ విసిరారు
ఒక్క నర్సరీ పెట్టారా?
కాంక్రీట్ జంగిల్గా మారిన హైదరాబాద్ మహానగరంలో కొత్తగా లంగ్ స్పేస్ పార్కులు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టి, 16 వేల నర్సరీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక నర్సరీ కూడా పెట్టకపోగా ఉన్న చెట్లను నరికేశారని ఆరోపించారు. రూ.10 వేల కోట్లకు కకుర్తిపడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జీవవైవిధ్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. పెద్ద మొత్తంలో చెట్లను నరికివేశారని విమర్శించారు. హైదరాబాద్లో ఐటీని అభివృద్ధి చేశామని, ఆ రంగంలో మూడు లక్షల నుంచి 9 లక్షలకు ఉద్యోగాలు పెంచామని గుర్తు చేశారు.
క్రైం రేటు పెరగడం ప్రభుత్వ వైఫల్యం కాదా?
కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పట్టపగలే హత్యలు, దోపిడీలు చోటుచేసుకుంటున్నాయని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సీసీ కెమెరాలు పెట్టి కేసీఆర్ హైదరాబాద్లో శాంతి భద్రతలు పెంపొందించారని చెప్పారు. ఇప్పు డు సైబరాబాద్లో 41 శాతం, హైదరాబాద్ లో 60 శాతం క్రైం రేటు పెరిగిందని వెల్లడించారు. డే లైట్ మర్డర్లు పెరిగాయని అన్నారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్ర శ్నించారు. మహారాష్ట్రలోని ముంబై పోలీసులు హైదరాబాద్లోని చర్లపల్లిలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారంటే అంతకంటే అవమానం ఉంటుందా? అని నిలదీశారు. హోం శాఖను తన వద్ద పెట్టుకున్న సీఎం దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
ఏం చేసిందో చెప్పి కాంగ్రెస్ ఓట్లడగాలి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే గత రెండేండ్ల్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో లెకలు చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని కేటీఆర్ సవాల్ చేశారు. దీనిపై ఎకడ చర్చ పెట్టినా రావడానికి తాము సిద్ధమని స్పష్టంచేశారు. చర్చించడానికి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్లేస్, టైమ్ వాళ్లు చెప్పినా సరే.. తమను చెప్పమన్నా సరే అని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటరైనా? గాంధీభవన్ అయినా? అసెంబ్లీలో చర్చ పెట్టినా తాము ఈ విషయాలపై చర్చించడానికి రెడీగా ఉన్నామని కేటీఆర్ తేల్చిచెప్పారు.
రేవంత్, మోదీది ఫెవికాల్ బంధం
ప్రధాని మోదీ, రేవంత్రెడ్డి మధ్య మంచి ఫెవికాల్ బంధం ఉన్నదని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తున్నదని పునరుద్ఘాటించారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాహుల్గాంధీ విమర్శిస్తే.. అదే సంస్థలను రేవంత్ నమ్ముతారని చెప్పారు. మైనార్టీలను అవమానించినందుకు రేవంత్రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లైడిటెక్టర్ టెస్ట్కు సిద్ధమా రేవంత్?
ఫార్ములా-ఈ కేసులోనూ గవర్నర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చినా, చార్జిషీట్లో విషయం లేకపోవడం వల్ల దానిని కాంగ్రెస్ ప్రభుత్వం పకన పెట్టేసిందని కేటీఆర్ తేల్చిచెప్పారు. తనపై చేసిన ఆరోపణల విషయంలో.. దమ్ముంటే ఈ ప్రభుత్వం తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. తనపై సీబీఐ కేసు ఉన్నదని, ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డిపై సీబీఐ కేసు ఉన్నదని, తాను లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమేనని, రేవంత్రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ పచ్చి అబద్ధాలు చెప్తున్న కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ను క్లీన్సిటీగా మార్చాం
హైదరాబాద్లో శానిటేషన్ సమస్య పరిషారానికి చర్యలు చేపట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని కేటీఆర్ స్పష్టంచేశారు. కేసీఆర్ కూడా సీఎంగా ఒక ఏరియాను ఎంచుకొని అకడ శానిటేషన్ పనులు పర్యవేక్షించారని గుర్తు చేశారు. స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వేలాది స్వచ్ఛ్ ఆటోలను ప్రవేశపెట్టామని చెప్పారు. ఇప్పుడు కనీసం ఒక ఆటోనైనా ప్రవేశపెట్టారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ హయాంలో ప్రతి రోజు 7.5 టన్నుల చెత్తను సేకరించామని వెల్లడించారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్లో 34 అవార్డులు సాధించామని తెలిపారు. బెస్ట్ క్వాలిటీలో నంబర్ వన్ సిటీగా హైదరాబాద్కు అవార్డు వచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎస్ఎన్డీపీని కూడా స్టార్ట్ చేసినట్టు గుర్తుచేశారు. పదేండ్ల్లలో కేసీఆర్ హైదరాబాద్ను క్లీన్సిటీగా మారిస్తే, ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మురికికూపంగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వేలాది స్వచ్ఛ్ ఆటోలను మేం ప్రవేశపెట్టాం. ఇప్పుడు ఒక్క ఆటోనైనా ప్రవేశపెట్టారా? మా హయాంలో ప్రతి రోజు 7.5 టన్నుల చెత్తను సేకరించాం. స్వచ్ఛ్ సర్వేక్షణ్లో 34 అవార్డులు సాధించాం. బెస్ట్ క్వాలిటీలో నంబర్ వన్ సిటీగా హైదరాబాద్కు అవార్డు వచ్చింది.
-కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే గత రెండేండ్ల్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో లెకలు చెప్పి ప్రజలను ఓట్లు అడగాలి. దీనిపై ఎకడ చర్చ పెట్టినా రావడానికి మేం సిద్ధం. చర్చించడానికి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నేతలు సిద్ధమా. ప్లేస్, టైమ్ వాళ్లు చెప్పినా సరే.. మమ్మల్ని చెప్పమన్నా సరే. కమాండ్ కంట్రోల్ సెంటరైనా? గాంధీభవన్ అయినా? అసెంబ్లీలో చర్చ పెట్టినా ఈ విషయాలపై చర్చించడానికి రెడీగా ఉన్నాం.
-కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక నర్సరీ కూడా పెట్టకపోగా ఉన్న చెట్లను నరికేశారని ఆరోపించారు. రూ.10 వేల కోట్లకు కకుర్తిపడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జీవవైవిధ్యాన్ని దెబ్బతీశారు. పెద్ద మొత్తంలో చెట్లను నరికివేశారు.
-కేటీఆర్