హైదరాబాద్ : బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీ బొయినపల్లి వినోద్కుమార్( B. Vinid Kumar) , మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్బాబు ( Ramesh Babu ) దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్( SCR GM ) తో సోమవారం భేటీ అయ్యారు. కాజీపేట రైల్వే డివిజన్( Railway Division ) తో పాటు స్థానికులే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని 40 ఏళ్ల నుంచి డిమాండ్ ఉందని, అయితే కేంద్రం పదేళ్ల క్రితం వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం ప్రకటన చేసిందని తెలిపారు. స్థానిక నాయకులు ఈ ప్రాంత రైతులతో మాట్లాడి తక్కువ ధరతో భూమి ఇవ్వడానికి ఒప్పుకున్నారని వివరించారు.
అయితే ఫ్యాక్టరీలో స్థానికులకు కాకుండా ప్రైవేట్ వారిచే పనులు చేస్తున్నట్టు జీఎం పేర్కొన్నారని, స్థానికులకు అవకాశమివ్వాలని కోరినట్లు వారు వెల్లడించారు. కాజీపేట రైల్వే డివిజన్ విషయం రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుందని జీఎం వివరించారని తెలిపారు.
లాతూర్లో స్థానికులకు ఇచ్చిన విధంగా కాజీపేటలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.