హైదరాబాద్, మార్చి 02 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆడబిడ్డలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. జాతీయస్థాయి మిస్, మిసెస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన మాడల్స్ను గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని, అందాల పోటీల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని ఆకాంక్షించారు. 2022 మిసెస్ ఇండియా, మిసెస్ తెలంగాణ, వివిధ జాతీయస్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన సుహాసిని పంద్యంను ప్రత్యేకంగా అభినందించారు.
ఇన్నాళ్లూ అందాల పోటీలు ఉత్తరాదికే పరిమితమయ్యాయయిని, వాటిని తెలంగాణలో ఏర్పాటు చేసి, ఇక్కడి యువతులను మాడలింగ్ రంగంలో సుహాసిని పంద్యం తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ఫిబ్రవరి 12న తాజ్బంజారాలో మిస్, మిసెస్ ఇండియా సీజన్-1 పోటీల మొదటి సీజన్ ముగిసిందని, త్వరలో సీజన్ -2 పోటీలు నిర్వహిస్తామని గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ డైరెక్టర్ సుహాసిని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్సాగర్, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములు, రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్యాదవ్, సోషల్ మీడియా ఇన్చార్జి మోహన్నాయక్, కోశాధికారి సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.