హైదరాబాద్ : పెట్రోల్( Petrol ), డీజిల్ ధరల ( Diesel Prices ) పెంపునకు నిరసనగా ఎల్బీనగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన ( BRS Protest ) తెలిపారు. నిరంతరం అడ్డగోలుగా ధరను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ( MLA Sudheer reddy ) ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెరుగుతున్న ఇంధన ధరల వల్ల సామాన్య ప్రజల జీవనం తీవ్రంగా దెబ్బతింటోందని, కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ఇలాంటి అన్యాయ ధరల పెంపులను అడ్డుకునేందుకు ప్రజలను చైతన్యవంతం చేస్తూ భవిష్యత్తులో కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, పలు డివిజన్ల అధ్యక్షులు, మహిళ అధ్యక్షులు, ఉద్యమకారులు, యువ నాయకులు, మహిళా నాయకులు, వివిధ విభాగాల అనుబంధ కమిటీ సభ్యులు, కార్యకర్తలు , పార్టీ అభిమానులు పాల్గొన్నారు.