హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి విశేష సేవలు అందించిన కేసీఆర్ చావును కోరడం దారుణమని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నదని విమర్శించారు. చావుడప్పు చాటింపు మంచి సంప్రదాయం కాదని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ముమ్మాటికీ ఈ చర్యను ప్రేరేపించిన వా రిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం శాసనమండలిలో మధుసూదనాచారి మాట్లాడారు.
ఎమ్మెల్సీ ల సస్పెన్షన్ వ్యవహారంలో ప్రభుత్వం తన తప్పును తెలుసుకొని యావత్ తెలంగాణ స మాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభ ఉన్నత విలువలు పాటించాలని చెప్పారు. తమ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారని, నిన్న సభలోకి వస్తే వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. వెంటనే తమ సభ్యుల సస్పెన్షన్ను ఎత్తివేయాలని, వాళ్లు సభలోకి వచ్చేవరకు తమ నిర సన కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఇది ప్రీ ప్లాన్డ్ కుట్ర అని, సస్పెన్షన్ తీర్మానంపై చర్చ జరుగాలని సిరికొండ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : మాజీ సీఎం కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వెల్లడించారు. తెలంగాణ సమాజానికి సేవలందించిన వారి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు తగవని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగిస్తామని స్పష్టంచేశారు. శుద్ధీకరణ ఏ పార్టీ చేసినా తప్పే
అని.. ఈ ఘటనను సభ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు.