వనపర్తి, డిసెంబర్ 18 : దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి విజయం చేకూరాలని వనపర్తి జిల్లాకు చెందిన పలువురు ఆ పార్టీ నేతలు కేరళలోని శబరిమల అయ్యప్పస్వామిని వేడుకొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి బీఆర్ఎస్ నేత నాగరాజుతో పాటు మరో ఐదుగురు నాయకులు పూజలు చేశారు.
అనంతరం బీఆర్ఎస్ ఫ్లెక్సీని ప్రదర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చొరవతో అన్ని రంగాల్లో వనపర్తి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతున్నదని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో దేశంలో పాలనా పగ్గాలు చేపట్టి ప్రపంచంలోనే దేశాన్ని ముందంజలో నిలబెట్టాలని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్కు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.