మియాపూర్ : సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ(MLA Gandhi) అన్నారు. నియోజకవర్గంలోని వివేకానందనగర్ డివిజన్ వెంకటేశ్వరనగర్కు చెందిన బీజేపీ నాయకురాలు(BJP Leader) సురేఖ గురువారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్(BRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్శితులై ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు క్యూ కడుతున్నారని ఆయన అన్నారు. దీంతో ఆయా పార్టీలకు కార్యకర్తలు కరువవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందిస్తున్నదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణ లక్ష్మి, దళిత బంధు, కేసీఆర్ కిట్, కంటివెలుగు సహా ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని వెల్లడించారు.
ఇతర రాష్ట్రాల్లోనూ ఈపథకాల అమలుకు ప్రజల నుంచి డిమాండ్లు వస్తుండటం సీఎం కేసీఆర్ దక్షతకు నిదర్శమన్నారు. కొత్తగా పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ తగు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. పార్టీ పటిష్టత కోసం పాటుపడే వారికి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, సంజీవరెడ్డి, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన వారికి అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం మంజూరైన రూ. 21,71,000 సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తున్నదన్నారు. పేదరికంతో అనారోగ్యాలతో బాధపడే వారికి ఈ పథకం ఆర్థిక సాయంతో కార్పొరేట్ వైద్యంతో స్వస్థతను పొందుతున్నారన్నారు. దరఖాస్తుదారులకు వీలైనంత త్వరగా సహాయం అందేలా తాను కృషి చేస్తున్నట్లు విప్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రఘునాథ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్,చంద్రకాంత్రావు, చంద్రారెడ్డి, చంద్రమోహన్సాగర్ పాల్గొన్నారు.