ఇంద్రవెల్లి : కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల పంట పొలాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందజేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో నిరంతరం విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విమర్శించారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం, నీటిపారుదల సమస్యలు, విద్యుత్ సమస్యలు, యూరియా కొరత, రైతు బీమా తదితర సమస్యలపై రైతు సదస్సులు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఆరు గ్యారంటీల పేరుతో నిలువునా మోసం చేశారని విమర్శించారు. యూరియా యాప్ తో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ ఎస్ తరఫున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మారుతిపటేల్ డోంగ్రే, నాయకులు జిలానీ బేగ్, సుఫియాన్, అముల్, గైను, ధరణి ధన్ రాజ్, శైలేందర్, తదితరులు పాల్గొన్నారు.