KCR | ముఖ్యమంత్రిని ఆరు గ్యారంటీలు, కరెంటు మాయమైంది.. నీళ్లెందుకు మాయమైతున్నయ్ అంటే.. ఆయన నేను పండవొట్టి తొక్కుత.. పేగులు మెడల వేసుకుంట.. పెండ మోకానికి రాసుకుంట.. చీరుత.. సంపుత.. మానవ బాంబునైత.. మట్టిబాంబునైత అని మాట్లాడుతున్నడు. ఇంత అసహనమా..? అంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. కరీంనగర్ కదనభేరిలో బీఆర్ఎస్ అధినేత పాల్గొన్నారు. ‘తెలంగాణ ఆశలు అడియాసలై దిక్కుతోచని స్థితిలో, భయంకరమైన కరువు కాటలతో కరెంటు కోతలతో.. ఆత్మహత్యలకు, వలసలకు ఆలవాలమైన తెలంగాణ.. ఇగ ఎక్కడైతది తెలంగాణ.. దశ దిశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటించాం. ఆ రోజు ఎవరికీ విశ్వాసం లేదు. తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దనే ఆంక్షలు’ ఉండేవని గుర్తు చేశారు.
‘ఆ రోజు నాకున్న పదవులన్నీ విసిరివాళ్ల మోఖానపడేసి తెలంగాణ కచ్చితంగా నిలబడాలి.. కలబడాలి.. సొంత రాష్ట్రం కావాలి.. సొంత రాష్ట్రమైతే తప్ప దిక్కులేదని.. ఒక్కడిగా.. సైన్యంగా.. పిడికెడు మందితో జై తెలంగాణ అని బయలుదేరినం. హైదరాబాద్లో చర్చోపచర్చలు. ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రజాగర్జన కావాలి. బ్రహ్మాండమైన చైతన్యవంతులైన ప్రజలున్న జిల్లా కరీంనగర్ జిల్లా. ఇది పోరాటాల గడ్డ. ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పి ఇదే ఎస్సారార్ కళాశాల మైదానంలో.. ఇదే రాత్రి సమయంలో మే 17న 48 డిగ్రీల ఎండ. అయినా తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలూదాలని వస్తే ఆ నాడు వస్తే తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తు ఎత్తిన గడ్డ ఈ గడ్డ. ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకొని.. పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి ఉద్యమం కోసం బయలుదేరిన. ఆ తర్వాత కథంతా మీకు తెలుసు. ముందుండి మీరే నన్ను నడిపించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ. మాతోని నువ్వు గెలిచినవ్ కేసీఆర్.. నీ లెక్కేది.. బిషాద్ ఏంది అని మాట్లాడితే ఆ నాడు కేంద్రమంత్రి పదవి, ఎంపీ పదవి నేలకేసి కొట్టి రార నా కొడకా కరీంనగర్కు అని మళ్లీ ఇక్కడికి వచ్చిన. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో.. ఎన్ని మాయోపాయాలు చేశారో.. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందే నాకంటే మీకే తెలుసు. బ్రహ్మాండంగా మరోసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ.. తెలంగాణ అడ్డ అనే పద్ధతిలో 2.50లక్షల మెజారిటీతో నన్ను గెలిపించి మరోసారి తెలంగాణ చైతన్యాన్ని చాటింది ఈ గడ్డ’ అన్నారు.
‘పరిణామాలు జరుగుతుంటయ్. మనం తెలంగాణ సాధించినం. మంచి చేసినం. కొన్ని సందర్భాల్లో అత్యాశకో.. దురాశకో.. మరోరకంగా ప్రజలు మోసపోతరు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ రోజు వందరోజుల్లోనే ఏం జరిగిందో ప్రజలు మీందరికీ తెలుసు. ఏం మాట్లాడుతున్నరంటే.. మేం ఎక్కువ ఇస్తం. ఆరు చందమామలు పెడుతం.. ఏడు సూర్యులు పెడుతం అని మాట్లాడిండ్రు. రైతుబంధు రూ.15వేలు వేస్తం.. కల్యాణలక్ష్మికి తులం బంగారం కలిపిస్తం అన్నరు. ఇవాళ నోటికి మొక్కాలి. 420 హామీలు ఇచ్చి బయలుదేరారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నరు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతం అని ఓ మంత్రి మాట్లాడుతున్నడు. నేను చెప్పిన బిడ్డా.. రైతుల చెప్పులు చాలా బందబస్తుగా ఉంటయ్. వాళ్లు అదే పనికి ఎత్తుకుంటే మీ గతి అని చెప్పిన. రైతుల చెప్పులు బందబస్తుగా ఉండయా..? మంత్రిగా ఉన్న వ్యక్తి రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతం అంటున్నడు. ఇంకెవడో సన్నాసి ఇంకోటి అంటడు’ మండిపడ్డారు.
‘ముఖ్యమంత్రిని ఆరు గ్యారంటీలు, కరెంటు మాయమైంది.. నీళ్లెందుకు మాయమైతున్నయ్ అంటే.. ఆయన నేను పండవెట్టి తొక్కుత.. పేగులు మెడల వేసుకుంట.. పెండ మోకానికి రాసుకుంట.. చీరుత.. సంపుత.. మానవ బాంబునైత.. మట్టిబాంబునైత అని మాట్లాడుతున్నడు. ఇంత అసహనమా..? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషనా? పద్ధతా? తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఇదో గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. కరీంనగర్ గడ్డ నుంచి యావత్ తెలంగాణ ప్రజానీకానికి నేను పిలుపునిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మానవబాంబు అయితమని మాట్లాడవచ్చునా ? మాకు మాట్లాడరాదా? తిట్టాలంటే తిట్లు తక్కువ ఉన్నయా? ఇవాళ గియాళకు మొదలుపెడితే రేపు గియాళ వరకు మాట్లాడొచ్చు. నేను మాట్లాడినా.. ఉద్యమంలో మాట్లాడాను. తెలంగాణను వ్యతిరేకించినోళ్లను దద్దమ్మలు, సన్నాసులు అన్నాను. సమైక్యవాదం.. సమగ్ర అభివృద్ధి అంటే.. సన్నాసున్నాలారా ఏదిరా అని మాట్లాడిన. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదేళ్లలో ఒక్కరోజు, సందర్భంలో దురుసుమాటలు విన్నరా? నేను చెప్పే మాటలపై ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం’ అన్నారు.