మంథని, ఏప్రిల్ 10: ‘నన్ను చంపేందుకు కాంగ్రెస్ నాయకులు కు ట్రలు చేస్తున్నారు.. పదవీకాలం ము గిసిన వెంటనే గన్మెన్లను తొలగించి హతమార్చేందుకు పథకం రూపొం దించారు’ అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సంచలన ఆరోపణలు చేశారు. మంథని ప్రజల ఆశీర్వాదంతో బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మె ల్యేగా, జడ్పీ చైర్మన్గా ఎదిగిన తనపై కాంగ్రెస్ నేతలు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేసి ప్రజల నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. 2018, 2023లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి స్థానికంగా అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ నేతలు, రాబోయే ఎన్నికల్లో వారికి ఎదురు లేకుండా చూసేందుకు తనను భౌతికంగా లేకుండా చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. బుధవారం ఆయన పెద్దపల్లి జిల్లా మంథనిలోని రాజగృహలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలన ఇసుక, మట్టి, బియ్యం మాఫియాకు కేరాఫ్గా మారిందని నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు తనపై అడ్డగోలుగా ఆరోపణలు చేసి, అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా ఆధారాలు ఎందుకు చూపడంలేదని ప్రశ్నించారు.