BRS Party | హైదరాబాద్ : ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సంచలనం సృష్టించబోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి, గులాబీ జెండా అత్యధిక సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు సర్వే రిపోర్టుల్లో తేలుతుంది. C-PAC సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీ 8 లోక్సభ స్థానాల్లో విజయం సాధించనున్నట్లు సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ 6, బీజేపీ 2, ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందే అవకాశం ఉన్నట్లు ఆ సర్వేలో తేలింది.
ఇదే సీ పాక్ సంస్థ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సర్వే చేసింది. నాటి సర్వేలో కాంగ్రెస్కు అత్యధిక సీట్లు వస్తున్నాయని చెప్పింది. వాస్తవానికి అదే జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి 40, కాంగ్రెస్కు 66, బీజేపీకి 4, బీఎస్పీకి 2, ఎంఐఎంకు 5, సీపీఐకి ఒక స్థానం వచ్చే అవకాశం ఉన్నట్లు నాటి సర్వేలో వెల్లడైంది. ఇక బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. ఇప్పుడు కూడా C-PAC సర్వే ఫలితాలు నిజమయ్యే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
TELANGANA LOKSABHA PARTY WISE PUBLIC OPINION POLL. pic.twitter.com/z4VR3baLB5
— C-PAC (@CIVICPOLL) April 17, 2024