(నాందేడ్ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): భారత రాష్ట్ర సమితి మహారాష్ట్రలో చేపట్టిన తొలిరోజు శిక్షణ విజయవంతమైంది. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, సమన్వయకర్తలు, మహిళా కన్వీనర్లకు రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణా శిబిరాలను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు నాందేడ్ విమానాశ్రయానికి చేరుకొన్న సీఎం కేసీఆర్కు మహారాష్ట్ర బీఆర్ఎస్ ముఖ్య నాయకులు శంకరన్న దోండ్గే, తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
అక్కడి నుంచి సీఎం కేసీఆర్ మొదట శంకరన్న దోండ్గే ఇంటికి వెళ్లారు. అనంతరం పట్టణంలోని అనంతలాన్స్లో జరిగిన శిక్షణా శిబిరాలకు చేరుకొన్నారు. వేదిక మీద ఛత్రపతి శివాజీ మహారాజ్, బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రీబాయిపూలే, మహాత్మా బసవేశ్వర్, అన్నాభావు సాఠే విగ్రహాలకు పూలమాల వేసి, నివాళి అర్పించారు. తరువాత వేదిక ముందు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. మధ్యాహ్నం 1.40 నుంచి 2.50 దాకా వివిధ అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఇక్కడే పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. తర్వాత నాందేడ్లోని బీఆర్ఎస్ నాయకుడు వీ వెంకటాచారి ఇంటికి వెళ్లారు. అక్కడినుంచి నేరుగా నాందేడ్ విమానాశ్రయానికి వెళ్లి హైదరాబాద్కు పయనమయ్యారు.
ఎన్సీపీలో చాలాకాలం పనిచేశా. మహిళల హకుల కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్నాను. తెలంగాణాలో మహిళా సంక్షేమం బాగున్నది. ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇస్తున్నారు.
-కమల్ బిప్లా పాటిల్, జల్గావ్
నేను15 ఏండ్లపాటు మోదీకి వీరాభిమానిని. ఒకరకంగా చెప్పాలంటే అంధభక్తుడిని. అదే సమయంలో తెలంగాణ విజయగాథ చూసి ఆలోచనలో పడ్డా. తెలంగాణ మాడల్ను మహారాష్ట్రలో తీసుకురావాలని కంకణం కట్టుకున్నం.
-దీపక్పాటిల్, వెలే-చోప్డా తాలుకా