కంటోన్మెంట్, అక్టోబర్ 10: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే మళ్లీ అధికారం దక్కాలి.. కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ సాధించాలి.. అని కోరుతూ ఓ అభిమాని మంగళవారం తిరుపతి సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఈ మేరకు నగరంలోని రామంతపూర్కు చెందిన మిట్టకోరి ఆనంద్గౌడ్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత క్యాంప్ కార్యాలయం నుంచి ఈ యాత్రను చేపట్టాడు.
ఈ యాత్ర ఎల్బీనగర్, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, ఒంగోలు, అద్దంకి, గూడురు, శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి 15 రోజుల్లో చేరుకుంటుందని, వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని వేడుకుంటానని ఆనంద్గౌడ్ ఈ సందర్భంగా చెప్పారు.
గులాబీ పార్టీ గెలువాలనే సంకల్పంతో ఆనంద్గౌడ్ గతంలో నాలుగుసార్లు తిరుపతికి సైకిల్ యాత్ర చేపట్టడం విశేషం. 2018 అసెంబ్లీ, 2019లో పార్లమెంట్, 2020లో జీహెచ్ఎంసీ, 2021 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన సైకిల్ యాత్ర చేపట్టాడు. బీఆర్ఎస్ గెలుపు కోసం ఎన్ని యాత్రలు చేపట్టడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆనంద్గౌడ్ స్పష్టం చేశారు.