హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : కేటీఆర్పై అక్రమ కేసును ఎత్తేసేదాకా పోరాటం ఆపబోమని మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి స్పష్టంచేశారు. కేసీఆర్ మంత్రిగా ఎన్నో పరిశ్రమలు తెచ్చి తెలంగాణ ప్రతిష్ఠను పెంచితే.. రేవంత్రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయలేకే కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు.
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ: మహమూద్అలీ
కాంగ్రెస్ ఏడాది పాలన అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నదని ఎమ్మెల్సీ మహమూద్ అలీ విమర్శించారు. తెలంగాణను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేసిన కేటీఆర్పై ప్రభుత్వం అక్రమ కేసు బనాయించడం దుర్మార్గమని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు పోరాటలు కొత్తకాదని స్పష్టంచేశారు.
రాజకీయ కక్ష సాధింపు: సబితాఇంద్రారెడ్డి
రాజకీయ కక్ష సాధింపుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్పై కేసు పెట్టిందని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం దబాయింపు ధోరణితో అక్రమ కేసులు పెడుతున్నదని తెలిపారు.
రేవంత్రెడ్డికి బుద్ధిచెప్తాం: సత్యవతి రాథోడ్
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్రెడ్డికి తగిన బుద్ధి చెప్తామని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. అసెంబ్లీలో సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు.
కేటీఆర్పై కేసు నమోదు అక్రమం: కృష్ణారావు
కేటీఆర్పై కేసు నమోదు అక్రమమని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు విమర్శించారు. రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్కు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
అప్రజాస్వామికం: జోగు రామన్న
రాష్ట్ర శ్రేయస్సుకు పాటుపడిన కేటీఆర్పై రేవంత్రెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అసెంబ్లీలో చర్చ పెట్టాలి: పద్మా దేవేందర్రెడ్డి
ఫార్ములా ఈ రేస్ నిర్వహణపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రేస్ పోటీలను హైదరాబాద్లో నిర్వహించి, నగరం ఇమేజీని కేటీఆర్ పెంచారని కొనియాడారు.
రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్: విద్యాసాగర్రావు
రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్తో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు విమర్శించారు. ఫార్ములా-ఈ రేస్ పోటీలను హైదరాబాద్లో నిర్వహించి రాష్ట్ర ఇమేజ్ను పెంచిన కేటీఆర్పై కేసులను ఖండిస్తున్నామని తెలిపారు.
కక్షపూరితంగానే కేటీఆర్పై కేసు: కంచర్ల, రావుల
ప్రశ్నించడాన్ని సహించలేక కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేటీఆర్ కేసు నమోదు చేసిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. గ్యారెంటీలపై పెరుగుతున్న అసంతృప్తి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు.
రాజకీయంగా ఎదుర్కోలేకే కేసు: రవీంద్రకుమార్
కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసు బనాయించి కాంగ్రెస్ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్పై కేసు నమోదు చేసి రాష్ట్ర పరువు తీస్తున్నదని దుయ్యబట్టారు.
తెలంగాణ చూస్తూ ఊరుకోదు: బడుగుల
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దిగ్గజనేత కేటీఆర్ జోలికొస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని మాజీ ఎంపీ లింగయ్యయాదవ్ రేవంత్రెడ్డిని హెచ్చరించారు. కేటీఆర్ను తప్పుడు కేసులతో అరెస్టు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తెలిపారు.
రేవంత్ను ఏ1గా చేర్చాలి: గొంగిడి
కేటీఆర్ను అక్రమంగా టచ్ చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు సహించబోవని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి హెచ్చరించారు. ఈ రేస్తో ఏటా రూ.700 కోట్లు సమకూర్చే ఆదాయానికి గండికొట్టిన కేసులో రేవంత్రెడ్డినే ఏ1గా చేర్చాలని డిమాండ్ చేశారు.
ఫార్ములా రేస్లో అవినీతే జరగలేదు: బాజిరెడ్డి
ఈ రేసింగ్ పోటీల్లో అవినీతి జరగనేలేదని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తేల్చిచెప్పారు. ఒప్పందం ప్రకారమే పోటీలు జరిగాయని స్పష్టం చేశారు. హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన సీఎం నాటకాలాడుతున్నారని విమర్శించారు.
కేటీఆర్ అంటే రేవంత్కు వణుకు: మాలోత్ కవిత
ఫార్ములా -ఈ కార్ రేస్పై కేటీఆర్పై ప్రభుత్వం పెట్టిన కేసు అక్రమమని మాజీ ఎంపీ మాలోత్ కవిత పేర్కొన్నారు. కేటీఆర్పై కేసు రాజకీయ కక్షలో భాగమేననని స్పష్టం చేశారు.
ప్రజాపాలన పేరిట దుర్మార్గాలు: క్రాంతి కిరణ్
నిత్యం ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్పై రాజకీయ కక్షతోనే అక్రమ కేసు పెట్టారని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ విమర్శించారు. తెలంగాణను సీఎం రేవంత్రెడ్డి అభాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్వి నీచ రాజకీయాలు : గండ్ర
కాంగ్రెస్ సర్కార్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఐటీ రంగంలో హైదరాబాద్ను అంతర్జాతీయ నగరాల జాబితాలో చేర్చిన గొప్ప నేత కేటీఆర్ అని కొనియాడారు.
కేసులే రేవంత్ టార్గెట్: సండ్ర, చంద్రవతి, కొండబాల
బీఆర్ఎస్ను దెబ్బతీయాలని తమ పార్టీ నాయకులపై కేసులే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, బానోతు చంద్రవతి విమర్శించారు. హైదరాబాద్కు ప్రపంచ గుర్తింపు తేవడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ-రేస్ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు.
రేవంత్రెడ్డిపైనే కేసు పెట్టాలి: దాస్యం, పెద్ది, చల్లా, నన్నపునేని
ప్రపంచపటంలో తెలంగాణ రాష్ర్టాన్ని నిలిపిన కేటీఆర్పై కాకుండా రాష్ట్ర పరువు తీస్తున్న సీఎం రేవంత్రెడ్డిపైనే కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోమని, మరో ఉద్యమం ఎగిసిపడుతుందని స్పష్టం చేశారు.