Manipur Violence | మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణ, హింసాత్మక పరిస్థితులపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. మణిపూర్లో గిరిజన మహిళలపై అనాగరిక చర్యలు, ఆ రాష్ట్రంలోని పరిస్థితులపై ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్ చేసింది. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా మౌనంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు లోక్సభలో నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో కేకే వాయిదా తీర్మానం నోటీసులు అందజేశారు.
రాజ్యసభ అన్ని కార్యక్రమాలను వాయిదా వేసి 267 నిబంధన కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని కేకే డిమాండ్ చేశారు. మణిపూర్లో శాంతి నెలకొనడంతో పాటు సాధారణ పరిస్థితులు ఏర్పడాలని ఆకాంక్షించారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న మణిపూర్లో శాంతి నెలకొనాలని.. సాధారణ పరిస్థితులు ఏర్పడాలని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు.