KCR | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సభ్యుల సమావేశం శుక్రవారం జరగనున్నది. బీఅర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం లో ఈ సమావేశం జరగనున్నది. దీనికి పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరు కానున్నారు. ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.