BRS Party office | న్యూఢిల్లీ, మే 2 (నమస్తే, తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ప్రారంభానికి సిద్ధమైంది. వసంత్ విహార్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ కార్యాలయం తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 4న ప్రారంభించనున్న ఈ కార్యాలయాన్ని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ మంగళవారం సందర్శించారు. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించే యాగం, హోమం, ఇతర పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. నిర్దేశిత గడువుకన్నా ముందే ఈ కార్యాలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో దక్షిణాది రాజకీయ పార్టీల్లో అన్నాడీఎంకే తర్వాత ఢిల్లీలో కార్యాలయాన్ని స్థాపించుకున్న రెండో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ రికార్డు సృష్టించింది.
ప్రత్యేక ఆకర్షణగా ఫ్రంట్ వ్యూ
బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీసు ఫ్రంట్ వ్యూను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. పార్టీ అధినేత కేసీఆర్ 14 ఫీట్ల కటౌట్ బోర్డు ఫొటో, తెలంగాణ మ్యాప్, తెలంగాణ తల్లి విగ్రహం, కాకతీయ కళాతోరణం, పార్టీ గుర్తు ప్రత్యేక ఆక్షరణగా నిలువనున్నాయి.
బీఆర్ఎస్ కార్యాలయ ప్రత్యేకతలు