హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : పలువురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం మంగళవారం ముగిసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు సంతోశ్కుమార్, బడుగుల లింగ య్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర ఉన్నా రు. వీరిలో వద్దిరాజును మరోసారి రాజ్యసభ సభ్యుడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యు ల్లో బుధవారం 10 మంది, గురువారం 11 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు.