MLC Kavitha | ప్రజాస్వామ్యంపై చీకటి ముసురుకున్నది. ప్రత్యర్థులను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేని పిరికితనం తప్పుడు కేసుల పంజా విసురుతున్నది. అధికారం కుట్రలు, కుహకాల సం కెళ్లు బిగిస్తున్నది. ఇంగితం మరిచిన అహంకారం ఎంతకైనా తెగిస్తున్నది. ప్రజాస్వామ్యం ముసుగులో కొన్నేండ్లుగా సాగుతున్న నియంతృత్వంలో తాజా అంకం.. భారత జా గృతి సారథి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు!
ఈడీ కేసుల్లో మహిళలకు రక్షణపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే, అరెస్టు చేయవద్దన్న అత్యు న్నత న్యాయస్థాన ఆదేశం అక్షరాలై నిలిచి ఉండగానే, అరెస్టు చేయబోమని ఇచ్చిన మాట తడి మారకుండా ఉండగానే, ‘చీఫ్ ఆదేశం’ అంటూ ఈడీ శుక్రవారం కవితను అరెస్టు చేసింది. కేవలం సోదాల కోసం వచ్చామని ముందు చెప్పి, కోర్టు సమయం ముగి సేదాకా గడిపి, అకస్మాత్తుగా శుక్రవారం సాయంత్రం, గౌరవ ప్రజా ప్రతినిధి, చట్టసభ సభ్యురాలైన మహిళను, తెలంగాణ కోసం నిలబడ్డ పోరాటాల బిడ్డను, వందలాది పోలీసులను మోహరించి ఈడీ అరెస్టు చేసింది.
ఏండ్లు గడుస్తున్నా ఎటూ తేలని కేసులు, కోర్టులో ఆవలి తీరం చేరని వాదనలు, సోదాలు అరెస్టులంటూ సాగే వేధింపుల దర్యాప్తుల లోగుట్టు తెలియనిది ఎవరికి? ఈడీ తొడుగు లోపలున్న కోడ్ భాష గురించి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమున్నది? ఇది వెర్రితలలు వేసిన అధికార దాహపు వికృతరూపం. అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను ఉక్కుపాదాల కింద తొక్కేస్తున్న అహంకారం. ప్రత్యర్థి పార్టీలపై అధికార వ్యవస్థలను నిస్సిగ్గుగా ప్రయోగిస్తున్న అణచివేత చర్యల నిజ స్వరూపం. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. ఒక ఎన్నికలో గెలుపుకోసం, తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్ను అణచివేయడం కోసం, ఎంతకైనా దిగజారడానికి సిద్ధపడుతున్న సిగ్గుమాలినతనం.. అధికారమై, మైకుల ముందు వికాసాల నినాదాలతో పొడబెబ్బలు పెడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నరు. మోదీ బీజేపీ ప్రభుత్వ తీరు ఎమర్జెన్సీని మించిపోయిందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో నమోదైన కేసులో కేవలం ఎన్నికల షెడ్యూల్కు ఒక్క రోజు ముందు అరెస్టు చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అని వారు స్పష్టం చేస్తున్నారు.
చివరాఖరు: ‘ముందు ఈడీ తర్వాత మోదీ’ అన్నది మరోసారి రుజువైంది. శుక్రవారం ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు మొదలుపెట్టి కొన్నిగంటలు గడవక ముందే మోదీ హైదరాబాద్ వచ్చి మల్కాజిగిరిలో రోడ్షో నిర్వహించారు.
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అత్యం త నాటకీయంగా.. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఎలాంటి ట్రాన్సి ట్ వారంట్ లేకపోయినా కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ.. రాత్రి 8.45కు ఢిల్లీకి తరలించారు. పన్నెండు మంది ఈడీ అధికారుల బృందం శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకే కవిత ఇంటి వద్ద మోహరించింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ వాయిదా పడిన వెంటనే 1.45 గంటలకు కవిత ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోకి రావడంతోనే సెక్యూరిటీ సిబ్బంది ఫోన్లు, కవిత వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు, కవిత ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తనిఖీల పేరుతో ఆమె ఇంట్లో నానా హంగామా సృష్టించిన ఈడీ అధికారులు.. డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం 6.45 గంటల వరకూ సోదాల పేరుతో కాలయాపన చేశారు. కవిత ఇంట్లో సోదాలు జరుగుతున్నాయనే సమాచారం మీడియాకు చేరుకునేలోపే ఇంటి మొ త్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
కవిత ఇంట్లో సోదాలు జరుపుతున్నది ఇన్ కం ట్యాక్స్ అధికారులంటూ బీజేపీ అనుకూల మీడియా వార్తలు ప్రసారం చేసింది. మధ్యా హ్నం 4 గంటల వరకూ కవిత ఇంట్లో సోదా లు జరుపుతున్నది ఈడీ అధికారులనే విష యం తెలియరాలేదు. చాలా పకడ్బందీగా మీడియాను సైతం తప్పుదోవ పట్టించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈడీ అధికారులు కవిత స్టేట్మెంట్ను రికార్డు చేశారు. కవిత భర్త అనిల్కు ట్యాబ్లెట్లు ఇచ్చేందుకు పనిమనుషులను కూడా అనుమతించలేదు. బీఆర్ఎస్ లీగల్ టీమ్కు చెందిన సోమ భరత్కుమార్ సుప్రీంకోర్టు తీర్పులతో ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. కనీసం గేటు కూడా తెరవకపోవడంతో ఆయన వెనుదిరిగారు. మళ్లీ ఆయనను పిలిపించి.. సోదా లు మాత్రమే జరుపుతున్నామని నమ్మించారు. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుండగా.. అనుమతులు లేకుండా సోదాలు ఎలా చేస్తారని తాను ఈడీ అధికారులను ప్రశ్నించినట్టు సోమభరత్ మీడియాకు చెప్పారు. బీఆర్ఎస్, భారత జాగృతి కార్యకర్తలు, మాజీ నేతలు పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకొని, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారనే విషయం తెలుసుకున్న మా జీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి అక్కడికి చేరుకోగా, వారికి సైతం అనుమతి నిరాకరించారు. కార్యకర్తలు ఒక్కసారిగా గేటు వద్దకు దూసుకురావడంతో ఉద్రి క్తత నెలకొన్నది. ‘ఇదేమి దౌర్జన్యం కనీసం నా చెల్లిని కూడా చూడనివ్వరా’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ గేటు తెరిచే ప్రయత్నం చేశారు. హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, బీఆర్ఎస్, జాగృతి కార్యకర్తలంతా కేటీఆర్ వెనుక నిలువగా.. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో ఈడీ అధికారులు కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డిని లోపలికి అనుమతించారు. లోపలికి వెళ్లిన కేటీఆర్.. వివరాలు తీసుకొని ట్రాన్సిట్ వారంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఈడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ భానుప్రియ మీనాను ప్రశ్నించారు.
సాయంత్రం వరకూ కవిత అరెస్టు విషయా న్ని దాచిపెట్టిన ఈడీ అధికారులు.. సాయం త్రం 5 గంటల తర్వాత శాసనమండలి చైర్మన్కు సమాచారం ఇచ్చారు. ఆమెను నిబంధనల ప్రకారం, పక్కా ఆధారాలతో అరెస్టు చేస్తున్నామని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగీందర్ తెలిపారు. అనంతరం కవితను 5.20కి అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. దాదాపు 14 పేజీలతో కూడిన రిపోర్టును కవితకు అందజేశారు. తన వాదనకు వ్యతిరేకంగా అరెస్టు చేస్తున్నా.. ఎమ్మెల్సీ కవిత శాంతియుతంగా వారికి సహకరించారు.
ఇంటినుంచి బయలుదేరేముందు ఎమ్మెల్సీ కవిత పిడికిలి ఎత్తి నినదించారు. ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని కారులో ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమవగా.. చిన్న కొడుకు ఆదిత్యను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆదిత్య నుదుటిపై ముద్దు పెట్టి, ధైర్యం చెప్పారు. కొడుకు కన్నీటి పర్యంతమవుతుండగా తలనిమిరి.. వెన్నుతట్టి సముదాయించారు. మెట్లు దిగుతూ చిరునవ్వుతో అభివాదం చేస్తూ కవిత ముందుకు కదిలారు. అనంతరం కారు ఎక్కేముందు భర్త అనిల్ను హత్తుకొని ఉద్వేగానికి గురయ్యారు. కాసేపు మేడే రాజీవ్సాగర్, శరత్తో మాట్లాడారు. కవిత అరెస్టుపై నిరసనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నాయకులు, పలు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మేడే రాజీవ్సార్, ఆంజనేయులుగౌడ్, నాయకులు రజినీ, గట్టు రామచంద్రయ్య, రూప్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
పేరేదైనా కానీ, టార్గెట్ విపక్షం.. సెక్షన్లు ఏవైనా కానీ, టార్గెట్ ప్రతిపక్ష నాయకులు.. ఇదీ మోదీ బీజేపీ ఈడీ, ఐటీని వాడుతున్న తీరు. గత పదేండ్ల కాలంలో దేశంలోని దాదాపు అందరు ప్రతిపక్ష నాయకులపై ఈడీ, ఐటీ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, జాతీయ ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు… ఎవరికీ దీన్నుంచి మినహాయింపులేదు. ఒక్క బీజేపీలో చేరిన వారికి తప్ప! అయితే బీజేపీలో చేరాలి.. లేదా దానికి లొంగాలి. ఇదీ తీరు. దేశంలో ఈడీ, ఐటీ కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖుల జాబితా ఇది…