Kavitha | హైదరాబాద్ : నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా.. వెంటపడి ఓడిస్తానని కవిత హెచ్చరించారు. నేను ఎక్కడ పోను బిడ్డా.. నిజామాబాద్ పార్లమెంట్కు వస్తా.. కచ్చితంగా గెలుస్తా. నాది నిజామాబాదే అని ఆమె తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ఎల్పీలో కవిత మీడియాతో మాట్లాడారు.
నిజామాబాద్ ఎంపీ ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు. ఏమైంది నువ్వెక్కడ పోటీ చేస్తావు.. నేనేక్కడ పోటీ చేస్తా అని మాట్లాడుతున్నారు. ఎంపీ అరవింద్కు ఒక అలవాటు ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు సెగ్మెంట్లు ఉంటే.. ప్రతి సెగ్మెంట్లో వారి పార్టీలో ముగ్గురిని మొదలుపెడుతాడు. అందరితో పైసలు ఖర్చు పెట్టిస్తడు. నీకు టికెట్ అంటే నీకు టికెట్ అంటే అని చెప్పి అందర్నీ ముంచుతడు. మొన్న వాళ్లందరూ కలిసిపోయి ఆయన ఆఫీసులో దాడి చేశారు. ఒక పక్క ప్రజలను మోసం చేయడం.. ఇంకోపక్క సొంత పార్టీ నాయకులను మోసం చేయడం ఆయనకు అలవాటుగా మారిందని కవిత విమర్శించారు.
నేను ఇది వరకే చెప్పాను.. మీ అందరి సాక్షిగానే చెప్పాను.. అరవింద్ నీవు ఎక్కడ నిలబడ్డా.. వచ్చి నీ వెంటబడి ఓడిస్తా అని కవిత పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన చెబుతున్నాడట. ఎంపీకి పోను.. ఎమ్మెల్యేగానే కోరుట్లలో పోటీ చేస్తానని అరవింద్ అంటుండట.. నేను ఎక్కడ పోను బిడ్డా.. నిజామాబాద్ పార్లమెంట్కు వస్తా.. కచ్చితంగా గెలుస్తా. నాది నిజామాబాద్.. నా సొంతూరు నా అత్తగారి ఊరు అని కవిత తెలిపారు.
నేను ఇంతకుముందే చెప్పిన.. బతికున్నా.. చనిపోయినా.. రేపు నా కట్టే కాలేది కూడా నిజామాబాద్లోనే అని కవిత అన్నారు. కచ్చితంగా నిజామాబాద్ నుంచే పార్లమెంట్కు పోటీ చేస్తా. నేను పారిపోయేది లేదు. నువ్వే కోరుట్ల పోతా.. అక్కడ పోతా.. ఇక్కడ పోతా అని అంటున్నవట. కోరుట్లకు పో.. అక్కడకు కూడా వచ్చి నిన్ను ఓడిస్తా. నువ్వు ఎక్కడన్న పో.. సర్పంచ్గా, ఎంపీటీసీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తవ.. నిన్ను వదిలిపెట్ట.. ఫస్ట్ వాగడం తగ్గించుకో. తెలంగాణకు పార్లమెంట్లో ఏం అడగాలనేది నేర్చుకోండి. కొంచెం మర్యాదలు నేర్చుకోండి.. మహేశ్ కుమార్ గౌడ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎన్ని మాట్లాడినా కేసీఆర్ను ఆశీర్వదిస్తారు అని కవిత పేర్కొన్నారు.