హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): బిల్కిస్ బానోపై గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించిన రేపిస్టుతో గుజరాత్లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే వేదిక పంచుకోవడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బిల్కిస్ బానో రేపిస్టుతో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే బహిరంగంగా వేదిక పంచుకున్నారు. ఒకవైపు బాధితులు న్యాయం కోసం వేడుకుంటుంటే.. మహిళలపై క్రూరమైన నేరాలకు పాల్పడిన నేరస్థులకు వేదికలు వేస్తూ, సంబరాలు చేస్తున్న సమాజంగా మనం ఏ దశకు చేరుకున్నాం? దేశం చూస్తున్నది’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ఆడపిల్లలు పుట్టడం గొప్ప వరం
ఆడపిల్లలు పుట్టడం నిజంగా గొప్ప వరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కు కూతురు జన్మించిన సందర్భంగా ఆయనకు, ఆయన భార్య రాజశ్రీకి కవిత ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.