MLC Kavitha | మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెబుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. పదేండ్లలో బీఆర్ఎస్ హయాంలో రుణం కోసం ఏనాడూ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని పేర్కొన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. ఈ మేరకు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కల్వకుంట్ల కవిత కీలక విషయాలను బయటపెట్టారు.
మూసీ పరివాహక ప్రాంతంలో పేద ప్రజల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని అనుకుంటున్నారని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్ 19వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందని అన్నారు. ఆ ప్రతిపాదనల్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అని స్పష్టంగా రాసి ఉందని తెలిపారు. కానీ మంత్రి శ్రీధర్బాబు మాత్రం మూసీ ప్రాజెక్టు కాదు.. మురుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కోరామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెబుతోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో రుణం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను, హైదరాబాద్ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకు ముందు రేవంత్ రెడ్డి మోకరిల్లుతున్నారని ధ్వజమెత్తారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేద ప్రజల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని అనుకుంటున్నారని స్పష్టం చేశారు.
“ప్రపంచ బ్యాంకుకు కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 19న ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనల్లో స్పష్టంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు అని స్పష్టం రాసుంది. కానీ మంత్రి శ్రీధర్ బాబు మాత్రం మూసీ ప్రాజెక్టు కాదు మరుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కోరామని తప్పుడు విషయం చెప్పారు. రియల్ ఎస్టేట్, ల్యాండ్ పూలింగ్ చేసి పెద్ద పెద్ద భవంతులు కడుతామని ప్రతిపాదనల్లో స్పష్టంగా పేర్కొంది. డీపీఆర్ లు ఉన్నాయని ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. కానీ ప్రభుత్వం మాత్రం శాసన మండలిలో డీపీఆర్ లు లేవని చెప్పింది. డీపీఆర్ తయారు కాలేదని డిసెంబరు 17న చెప్పిన ప్రభుత్వం … డీపీఆర్ ఉందని ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబరు 19న తెలియజేసింది. అంతేకాకుండా, ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపిన తర్వాత అక్టోబరులో డీపీఆర్ తయారీకి కాన్షార్షియంను ప్రభుత్వం నియమించింది.” అని వెల్లడించారు.
ఎందుకోసం అబద్దాలు చెబుతున్నారని, ఎవరి కోసం ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. పారదర్శకత లేకుండా ఎందుకు దాపరికంతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చే విషయంలోనూ ప్రభుత్వం రహస్యంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. అయితే, మూసీ ప్రాజెక్టు విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, ప్రపంచ బ్యాంకుకు, అసెంబ్లీకి, పేద ప్రజలకు వేర్వేరు మాటలు చెబుతోందని విమర్శించారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో భయానక పరిస్థితి నెలకొందని, 15 వేల ఇళ్లకు మార్కింగ్ చేయడం వల్ల తమ ఇళ్లను ఎప్పుడు కూల్చుతారో అన్న భయం వారిలో నెలకొందని ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేయబోయే రియల్ ఎస్టేట్ లో నిర్వాసితులకు ఏం వస్తుందో ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను వెల్లడించాలని సూచించారు.