BRS MLC Kavitha | నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం కార్తీక దీపోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నీలకంఠేశ్వర స్వామికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమె కలియతిగారు. ఈ క్రమంలో భక్తులు ఆమెతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక దీపోత్సంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. కార్తీక మాసానికి, నీలకంఠేశ్వర స్వామివారికి తమకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. చాలా ఏండ్ల నుంచి కార్తీక పౌర్ణమి ఈ ఆలయానికి వస్తుంటామని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా నిజామాబాద్ ప్రజలకు శుభం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.