హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రైతులకు అందించే సహాయంపై మోదీ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. 11కోట్ల మంది రైతులకు నగదు సహాయం ఇస్తున్నారని ప్రధాని చెప్పారని, కేంద్రం 3.87కోట్ల మంది రైతులకే నగదు సాయం అందిస్తోందని కవిత పేర్కొన్నారు. ఏటా నగదు సాయం లబ్ధిపొందే రైతుల సంఖ్యను కేంద్రం కుదిస్తూ వస్తోందని ఆరోపించారు.
అలాగే అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించి.. విచారణ జరిపించాలని భారత్ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తుందని స్పష్టం చేశారు. అదానీ సంస్థల్లో ప్రజల సంస్థ అయిన ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టిందన్నారు. అదానీ వ్యవహారంపై వస్తున్న విమర్శలు జవాబు చెప్పలేదని విమర్శించారు. జాతీయవాదం ముసుగులో ప్రధాని దాక్కుంటున్నారని ధ్వజమెత్తారు.