BRS MLC Kavitha | ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన కవిత బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఢిల్లీలోని ఈడీ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ జరుపనున్నది.