హైదరాబాద్, అక్టోబరు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పథకాల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు అంతర్జాతీయంగా మరోసారి గుర్తింపు లభించింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన లండన్లోని ప్రఖ్యా త ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ.. కీలకోపన్యా సం ఇవ్వడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది.
తెలంగాణ ముఖచిత్రా న్ని మార్చిన అభివృద్ధి, సంక్షే మ పథకాలపై ‘డెవలప్మెంట్ ఎకనామిక్స్’ అంశంపై ఈ నెల 30న జరుగనున్న సదస్సులో వివరించాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోరింది. పదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ఆకర్షించా యి. ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్ వెళ్లిన కవిత.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ అయ్యారు.