బాన్సువాడ, ఫిబ్రవరి 27: ‘ఆడబిడ్డల పెండ్లిండ్లకు రూ.లక్ష నగదుతోపాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ బంగారం ఎక్కడ దాచిందో గానీ.. అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు దాటినా ఇప్పటికీ ఆ ఊసే లేదు’ అని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన 222 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.