Harish Rao | సంగారెడ్డి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రులు చేసిన కామెంట్స్కు మాజీ మంత్రి హరీశ్రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్పై మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. రైతుల సమస్యల గురించి కేసీఆర్ మాట్లాడితే మంత్రులు ఆయనను తిడుతున్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదు అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు సిగ్గు ఉందా..? రాహుల్ గాంధేమో తన మేనిఫెస్టోలో ఇతర పార్టీ వాళ్ళను పార్టీలోకి తీసుకోవద్దు అని పెడతారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రలు మాత్రం ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి తీసుకుంటాం అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి రాదు. అటు ఉన్న సూర్యుడు ఇటు పొడిచిన కూడా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. మీరు ఎన్ని చేస్తారో చేయండి కానీ గుర్తు పెట్టుకొండి.. మేము వడ్డీతో సహా మీకు తిరిగి ఇస్తాము. మీరు ఎన్నిచేసిన ఇచ్చిన హామీలు అమలు చేసేదాక మిమ్మల్ని వదిలిపెట్టం.. మీ వెంట పడుతామని హరీశ్రావు హెచ్చరించారు.