Guvvala Balaraj | శ్రీశైలం : సుస్థిర పాలన అందించడం కేవలం కేసీఆర్తోనే సాధ్యపడుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు పీజేఆర్ ( పీ. జనార్థన్రెడ్డి ) ఆధ్వర్యంలో మూడు రోజుల క్రితం గోదల్ నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్రలో సుమారు 50 మంది నియోజకవర్గంలో పర్యటించి శనివారం సాయంత్రానికి శ్రీశైలం చేరుకున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ముడుపులు కట్టారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పీజేఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్తో పాటు గువ్వల బాలరాజులకు ఎల్లప్పుడూ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. దర్శనానంతరం తెలంగాణ ఆర్యవైశ్య నిత్యాన్నసత్ర సంఘం మల్లికార్జున సత్రంలో భోజన తాంబూళాలు స్వీకరించిన ఎమ్మెల్యే స్థానిక విషయాలను సత్ర సంఘం మేనేజర్ శివకుమార్ను అడిగి తెలుసుకున్నారు. సైకిల్ యాత్రలో పీజేఆర్ వెంట రాజేశ్వర్రెడ్డి, మనోహర్, నరేష్కుమార్, బాలరాజు, రఘుపతి, లక్ష్మన్, అంకుల్, బాలస్వామి, బొండయ్య, దాసుతోపాటు సత్ర నిర్వాహకులు శివగౌడ్, మోహన్క్రిష్ట, మల్లిక, శోభ, చంద్రకాంత్లు ఉన్నారు.