మారేడ్పల్లి, సెప్టెంబర్ 6: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. దివంగత ఎమ్మెల్యే జీ సాయన్న కూతురైన నందితకు వివిధ సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నాయి. బుధవారం వివిధ మహిళా, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు స్వయంగా నందితను కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
మహిళాలోకానికి కేసీఆర్ సర్కార్ ఎంతో లబ్ధి చేకూరుస్తుందని ఈ సందర్భంగా వారు కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో లాస్య నందితను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబూనారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పనస సంతోష్, నర్సింహ ముదిరాజ్, మురళీయాదవ్, భాస్కర్ ముదిరాజ్, వంగాల మల్లేశ్, సదానంద్గౌడ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.