హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రైతురాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కదలిరావాలని, బీఆర్ఎస్లో చేరాలని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు నాసిక్లో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాసిక్ డివిజన్ కో ఆర్డినేటర్ దశరథ్ కాకా సావంత్, మరాఠ్వాడా కో ఆర్డినేటర్ సోమనాథ్ తోరనాథ్ ఆధ్వర్యంలో స్వాభిమాని షేత్కరీ సంఘటన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమనాథ్ బోరాడే, దైనిక్ ఆవాజ్ ఎడిటర్, నవక్రాంతి సంఘటన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భగవాన్ సోన్వానే, షేత్కరి సంఘర్ష్ సంఘటన్ నందగావ్ తాలూకా అధ్యక్షుడు చంద్రకాంత్ బచావో, బాలాహాస్ బచావో, డాక్టర్ లక్ష్మణ్ సాబ్లే, ఎంఎన్ఎస్ మె డికల్ అలయన్స్ మాజీ జిల్లా అధిపతి బిలాల్ షేక్, సంపత్రావ్ జాదవ్, రామచంద్ర నికమ్, షెట్తోపాటుగా నాసిక్కు చెందిన వందలాది మంది యువకులు, రైతులు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలను కప్పి బీఆర్ఎస్లో మాణిక్ కదం సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం మాణిక్ కదం మాట్లాడారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భారత రాష్ట్ర కిసాన్ సమితి ఉత్తర మహారాష్ట్ర అధ్యక్షుడిగా నానాసాహెబ్ బచావోను నియమిస్తున్నట్టు కదం ప్రకటించారు.