హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పౌర స్మృతి దేశాభ్యున్నతికి గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి యూసీసీ బిల్లు తూట్లు పొడుస్తుందని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
ప్రజల మధ్య చిచ్చు పెట్టే ఈ బిల్లును పార్లమెంటులో అడ్డుకుని తీరుతామ ని స్పష్టంచేశారు. బిల్లును ఉపసంహరించేంత వరకు బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.